చనిపోయిన వ్యక్తులు ప్రేతాత్మలుగా మారతారా..?, మారి మన మధ్యనే
తిరుగుతన్నారా...? ఈ భయానక సందేహాలు మనలో చాలమందిలో మెదులుతూనే ఉన్నాయి.
అందుకు కారణం లేకపోనూ లేదు. నిత్యం సమాజంలో చోటుచేసకుంటున్న పలు సంఘటనలకు
కారణాలుగా మానవాతీత శక్తులను చూపుతున్నారు. ఈ మూఢనమ్మకాలను పలువురు
కొట్టిపరేస్తున్నప్పటికి ఏదో ఒక కోణంలో అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.
నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా భయానక ఆకారలతో కూడిన పలు అనుమానస్పద
ఫోటోగ్రాఫ్ లను మీకు చూపెడుతున్నాం.
తవ్వకాల్లో బయటపడ్డ రక్త పిశాచాలు?
పోలాండ్ లోని పురాతత్వ నిపుణులకు ఓ కట్టడానికి సంబంధించి నిర్వహించిన
తవ్వకాల్లో భాగంగా భయానక అస్తిపంజరాలతో కూడిన సమాధులు బయటపడ్డాయి. ఈ
అస్తిపంజరాలలో కొన్నింటికి తలలు వేరుకాబడి కాళ్ల దగ్గర ఉన్నాయి. దీంతో ఈ
సమాధుల పై అనేక సందేహాలు వ్యక్తమవటంతో పాటు భయాందోళణతో కూడిన వాతావరణం
అక్కడ నెలకుంది.దక్షిణ పోలాండ్ లోని గిల్ వైస్ పట్టణంలో చేపట్టిన
తవ్వకాల్లో భాగంగా ఈ అస్లిపంజరాలుబయటపడ్డాయి. ఈ స్కెలిటన్ లు 16 లేదా 17వ
శతాబ్ధం నాటివిగా నిపుణులు భావిస్తున్నారు. పురాతత్వ నిపుణులు ఇటీవల కాలంలో
అనేక సందేహాస్పద సమాధులను తవ్వకాల్లో భాగంగా వెలికితీసిన విషయం తెలిసిందే.
తాజాగా బయటపడిన ఈ సమాధులను పలువురు రక్త పిశాచాలకు చెందినవిగా
చర్చించుకుంటుంటే మరి కొందరు మాత్రం తేలికగా తీసుకుంటున్నారు. ఈ
అస్తిపంజరాలు రక్త పిశాచాలవేనా..? లేకుంటే శిక్షకు గురైన వారివా..? అన్న
కోణంలో నిపుణులు పరిశోధన సాగించాల్సి ఉంది.
Read more at: http://telugu.gizbot.com/news/old-camera-pictures-with-ghosts-008107.html
Read more at: http://telugu.gizbot.com/news/old-camera-pictures-with-ghosts-008107.html
No comments:
Post a Comment